మంచాల : టీఆర్ఎస్ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం మంచాల మండల టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా వనపర్తి బద్రినాథ్ గుప్తా, ప్రధాన కార్యదర్శి గంట విజయ్, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొట్టు ప్రవీణ్లు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, పార్టీ అధ్యక్షుడు చీరాల రమేశ్, ప్రధాన కార్యదర్శి బహదూర్, నాయకులు ప్రభాకర్, జానీపాషా, వీరేశం, సాయిగౌడ్ పాల్గొన్నారు.