నందిగామ : నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలో శనివారం పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయ శిఖర ప్రతిష్ఠ కుంభాభిషేఖ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా హాజరై దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎంపీటీసీల సంఘం నందిగామ మండల అధ్యక్షుడు కాట్న లతశ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని కోరారు.
కార్యక్రమంలో కొత్తూర్ ఎంపీపీ మధుసుధన్రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబాల్నాయక్, మాజీ సర్పంచ్ శ్రవన్కుమార్, నాయకులు కాట్న శ్రీశైలం, గోపాల్రెడ్డి, శ్రీహరి, పురుశోత్తం, శ్రవణ్గౌడ్, నర్సింహ పాల్గొన్నారు.