– పాల్వంచ బీఆర్ఎస్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్
– ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల సాధనపై సమాలోచనలు
పాల్వంచ, జూలై 23 : కొత్తగూడెంలోని కమ్మవారి కళ్యాణ మండపంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 25న జరిగే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పాల్వంచ 38వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు శంకుబాపన అనుదీప్, పాల్వంచ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జూపెల్లి దుర్గాప్రసాద్, అల్లి సాయికిరణ్, షారుఖ్, ఆర్ఎంపీ శ్రీను, శ్రీకాంత్ పాల్గొన్నారు.