నందిగామ : గ్రామాల భివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రూ. 13కోట్లతో మంజూరైన తిమ్మపూర్ నుంచి దామర్లపల్లి వయా చేగూరు బీటీ రోడ్డులో భాగమైన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ గురువారం ఎంపీపీ ప్రియాంకగౌడ్, సర్పంచ్ సంతోషతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రహదారులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించి ప్రభుత్వం మారుమూల గ్రామాలకు సైతం బీటీ రోడ్లు, సీసీ రోడ్లు మంజూరు చేస్తున్నారని తెలిపారు. రూ. 13కోట్లతో చేగూరుకు రోడ్డు మంజురు చేయించిన ఎమ్మెల్యే ఎంపీపీ, సర్పంచ్, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నయని రోడ్డు పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కొత్తూరు మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, చేగూర్ పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, సర్పంచ్లు గోవిందు అశోక్, జెట్ట కుమార్, నాయకులు వీరేందర్గౌడ్, బండి రాజు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.