షాద్నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 70లక్షలు వెచ్చించి షాద్నగర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రారంభించారు. ఇందులో భాగంగానే కార్యాలయంలో వాస్తు పూజ, హోమం, గోమాత పూజ చేశారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజాప్రతినిధులకు మెరుగైన మౌలిక వసతులను కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం ముందుందని, ఇందులో భాగంగానే లక్షల నిధులను వెచ్చించి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అనువుగా ఉండే విధంగా భవనాన్ని నిర్మించారన్నారు.
ఈ భవనం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ ఆహ్మాద్, జడ్పీటీసీలు వెంకట్రాంరెడ్డి, విశాల, కౌన్సిలర్లు ప్రతాప్రెడ్డి, సర్వర్పాషా, శ్రీనివాస్, అంతయ్య, నాయకులు పాల్గొన్నారు.