షాద్నగర్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీళ్లు అందుతాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్లో మిషన్ భగీరథ నల్లాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే మిషన్ భగీరథ పథకం ఆదర్శనీయమని, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీళ్లను సరఫరా చేయడం సంతోషకరమన్నారు. అతి త్వరలోనే ప్రతి ఇంటికి నీళ్లు అందుతాయని చెప్పారు. ఇందులో భాగంగానే చటాన్పల్లి, ఇంద్రానగర్ కాలనీల్లో భగీరథ నల్లాలను ప్రారంభించారు.
అనంతరం మండల పరిషత్ సమావేశ మందిరంలో 22మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. అదే విధంగా బీవీరావు నగర్కు చెందిన శ్రీనివాసరావుకు రూ. 60వేలు, ఆర్టీసీ కాలనీకి చెందిన స్వాతికి రూ. 56వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మున్సి పల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, కౌన్సిలర్లు కృష్ణవేణి, వెంకట్రాంరెడ్డి, నాయకులు మన్నె నారాయణ పాల్గొన్నారు.