షాద్నగర్ : ఓ వ్యక్తి మద్యం దుకాణం ఎదుట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన షాద్నగర్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని రాంమందిర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ (36 ) అనే వ్యక్తి కేశంపేట రోడ్డు చౌరస్తాలో ఉన్న భవాణి మద్యం దుకాణం ముందు మద్యం తాగి పడిపోయాడు. విషయాన్ని గమనించిన స్థానికులు శ్రీనివాస్ను లేపేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలంలో ఉన్న మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కన్నీరుమున్నిరయ్యారు. కల్తీ మద్యం తాగి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్థానిక పోలీసులు మృతదేహాన్ని షాద్నగర్ సర్కారు దవాఖానకు తరలించారు.