షాబాద్ : వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా బుధవారం రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ పాల్గొని వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, డీఆర్వో హరిప్రియ, బీసీ సంక్షేమాధికారి విద్య, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్రెడ్డి, కార్యాలయ సిబ్బంది, తెలంగాణ వాల్మీకి బోయసంఘం అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.