పెద్దేముల్, మే 4 : కులమతాల్లో చిచ్చుపెడుతున్న బీజేపీ..దొంగ హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని ఇందూరు, జయరాంతండా (ఓమ్లానాయక్ తండా) గ్రామాల్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మండి పడ్డారు.
మహిళలకు ప్రతినెలా రూ.2,500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఏటా రూ.15 వేల రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, వరి ధాన్యానికి రూ.500 బోనస్, ప్రతి కుటుంబానికీ రూ.200 యూని ట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, నిరుద్యోగ యువతకు ప్రతినెలా రూ.4 వేలు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు తదితర హామీలను అమలు చేయకుండా ప్రజలను కష్టాలపాలు చేస్తున్నదన్నారు. కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఏ ఒక్కరికీ కనీసం చెక్కు కూడా ఇచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు.
ఆరు గ్యారెంటీల గారడీ మాటలతో ప్రజలను నిలువునా ముంచిన కాంగ్రెస్కు ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మహేందర్రెడ్డి కుటుంబం వెళ్లిపోవడంతో తాండూరుకు పట్టిన శనిపోయిందన్నారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి తన సొంత వ్యాపారాలను పెంచుకునేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నారన్నారు. ఆయన ఒకవేళ గెలిచినా ఎవరికి చిక్కరు, దొరకరని.. బీజేపీకి ఓటేస్తే చెత్తకుండీలో వేసినట్లేనని పేర్కొన్నారు.
రంజిత్రెడ్డికి బీఆర్ఎస్ ప్రాధాన్యమిచ్చినా పార్టీ మారి వెన్నుపోటు పొడిచారన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్కుమార్, ఇందూరు ఎంపీటీసీ ప్రవీణ్పటేల్, బాల్రాజ్, ఇందూరు మొగులప్ప, మిత్రునాయక్, వడ్డె రాజు, నరేశ్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు టి.రమేశ్, బి.జనార్దన్రెడ్డి, జయరాంనాయక్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ధన్సింగ్, తట్టేపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంజయ్య, మాజీ సర్పంచ్ భరత్కుమార్, విజయ్, ఖదీర్, రాజ్కుమార్, శ్రీనివాస్గౌడ్, నరేశ్కుమార్, రెడ్యానాయక్, రాజు, ఈశ్వర్, రేవంత్, బందెప్ప, రాంచంద్రి, ఏక్బాల్, అంజిలప్ప, మహబూబ్, ప్రభు, రాములు నాయక్, గోవింద్ పాల్గొన్నారు.