కొత్తూరు, మే 4: ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్ సూచించారు. కొత్తూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో అమలకు సాధ్యంకానీ హామీలను గుప్పించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గులాబీ ప్రచార హోరుతో కొత్తూరు మున్సిపాలిటీ దద్దరిల్లింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, జడ్పీటీసీ శ్రీలత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు కొస్గి శ్రీనివాసులు, సోమ్లానాయక్, నాయకులు బాతుక దేవేందర్యాదవ్, పెంటనోళ్ల యాదగిరి, గోపాల్గౌడ్, శ్రీనివాస్గౌడ్, సత్తయ్య, బాల్రాజ్, రాజ్యలక్ష్మి, దేశాల జైపాల్, శివకుమార్, దామోదర్రెడ్డి, లక్ష్మణ్నాయక్, దేశాల భీమయ్య, పంపుల నరసింహాగౌడ్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.