పరిగి టౌన్, మే 4 : చేవెళ్ల లోక్సభ నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఓటర్లను కోరారు. శనివారం ఆయన మండలంలోని రంగంపల్లి, మిట్టకోడూరు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. బీసీ ముద్దు బిడ్డకు అవకాశం వచ్చిందని బీసీలంతా ఏకమై కాసాని గెలుపునకు కృషి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల దగ్గరకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మొద్దన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, నరహరి, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.