నందిగామ : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల పరిధిలోని చాకలిగుట్టతండా, రంగాపూర్, సలివేంద్రిగూడ, అప్పారెడ్డిగూడ, ఈదులపల్లి, మొత్కులగూడ, మసీదుమామిడిపల్లి, మామిడిపల్లి, శ్రీనివాసులగూడ, వెంకమ్మగూడ, బండోనిగూడ, బుగ్గోనిగూడ గ్రామాల్లో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ బుధవారం పలు అభివృద్ధి పనులకు జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని, టీఆర్ఎస్ పాలనలో గ్రామాలకు మహర్దశ పట్టిందన్నారు.
ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయని, ప్రతి గ్రామం పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక వసతులతో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రియాంకగౌడ్, వైస్ ఎంపీపీ మంజూల, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, సర్పంచ్లు రాజునాయక్, రమేశ్గౌడ్, నర్సింహులు, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.