ఇబ్రహీంపట్నం : తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న నిర్వహించిన దీక్షా దివస్కు నేటికి 12 ఏండ్లు. ఈ సందర్భంగా సోమవారం ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్కుమార్, టీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జెర్కోని రాజు మాట్లాడుతూ.. రాష్ట్రం సాధించే వరకు అలుపెరుగని పోరాటం కేసీఆర్ చేశారని అన్నారు. మహాత్మాగాంధీ చూపిన మార్గంలో ఉద్యమాన్ని నడిపి ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టేందుకు సిద్ధమైన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఆరాధ్యదైవం అని అన్నారు. సీఎం కేసీఆర్ చేసిన దీక్షా దివస్ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మైలారం విజయ్ కుమార్, యువజన విభాగం కోశాధికారి చింతకింది వీరేశ్, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు నిమ్మల ప్రసాద్గౌడ్, మంచాల మండలం టీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు కొంకని విజయ్కుమార్, టీఆర్ఎస్వీ నాయకులు సొప్పరి కరుణాకర్, కొండ్రు మహేష్, రంజిత్, ప్రశాంత్ పాల్గొన్నారు.