ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దండుమైలారం గ్రామానికి చెందిన వడ్డేపల్లి ఆండాలు రూ. 46వేలు, వడ్డేపల్లి లింగస్వామికి రూ. 60వేల సీఎం సహాయనిధి నిధులు మంజూరయ్యాయి. అట్టి చెక్కులను గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కిషన్రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సీఎం సహాయనిధి కింద పేద ప్రజలకు కోట్లాది రూపాయల నిధులు అందజేశామన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లీశ్వరి జంగయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు మంగ ఐలేష్ తదితరులు ఉన్నారు.