కొందుర్గు : కొందుర్గు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 50మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు.
పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజేశ్ పటేల్, మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, రామకృష్ణ, గోపాల్, మానయ్య, జగదీశ్వర్గౌడ్, రమేశ్, సుందర్ పాల్గొన్నారు.