కొత్తూరు : ప్రజారోగ్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్కు చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే స్థోమత లేని వారికి సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి ఎంత ఖర్చు అయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌల్సిలర్ కొస్గి శ్రీనివాస్, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్యాదవ్, బ్యాగరి యాదయ్య పాల్గొన్నారు.