షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని 5వ వార్డు సోలిపూర్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హామీ ఇచ్చారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కౌన్సిలర్ కృష్ణవేణి, గ్రామస్తులు వెంకటేశ్, రమేశ్యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలోని డంపింగ్యార్డు, విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. అదే విధంగా డంపింగ్యార్డు సమస్య కూడా త్వరలోనే పూర్తవుతుందనే విషయాన్ని గ్రామస్తులు గ్రహించాలన్నారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఇందులో భాగంగానే గ్రామానికి చెందిన చీపిరి కృష్ణయ్యకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 21వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్ అంతయ్య, నాయకులు జూపల్లి శంకర్, జమృత్ఖాన్, కందివనం సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.