తుర్కయాంజాల్ : రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ కొహెడ గ్రామానికి చెందిన రైతు కందుకూరి మహిపాల్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. రైతుబీమా నుంచి వచ్చిన రూ.5 లక్షల చెక్కును ఎమ్మెల్యే శనివారం మృతుడి భార్యకు అందజేసి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా రాష్ట్రంలో అమలు అవుతుందన్నారు. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో అబ్దుల్లాపూర్మెట్ మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ బలదేవ రెడ్డి పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కు అందజేత..
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన భాగ్యలక్ష్మికి రూ.52వేలు, చంద్రకళకు రూ.60వేలు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరయ్యాయి. అట్టి చెక్కులను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. సీఎం సహాయనిధి పథకం పేదలకు కొండంత అండగా నిలుస్తున్నదన్నారు.