ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 15 : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు జిల్లాలో ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామాన ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించాలన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్లో స్ఫూర్తిజ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంధుల ఆశ్రమంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ప్రారంభించారు. అంధ విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. అనంతరం వారికి బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని కొనియాడారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, అలాంటి మహనీయుని జన్మదిన వేడుకలను మనమంతా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకునిబుధవారం, గురువారం జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు నల్లబోలు మమత, నీలం శ్వేత, నీల్ల బానుబాబు, మంద సుధాకర్, కసరమోని పద్మ, ప్రసన్నలక్ష్మి, జెర్కోని బాలరాజు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, ప్రధాన కార్యదర్శులు భాస్కర్గౌడ్, వేణుగోపాల్రావు, పార్టీ నాయకులు జగదీశ్, మహేశ్గౌడ్, జెర్కోని రాజు, విజయ్కుమార్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
– పాల్గొన్న ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్
షాద్నగర్ : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బంగారు తెలంగాణ నిర్మాత సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మొదటి రోజు మంగళవారం షాద్నగర్ పట్టణంలో ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. షాద్నగర్ శివారులోని ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ నీడ్ అనాథాశ్రమంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేసి అనాథ చిన్నారులకు, వృద్ధులకు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ తాండ్ర విశాల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, నాయకులు రాజావరప్రసాద్, మన్నె నారాయణ, జమృత్ఖాన్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
షాబాద్ : రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మొయినాబాద్లో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మహేందర్రెడ్డి, నాయకులు యాదయ్య, మల్లారెడ్డి, కృష్ణారెడ్డి, సత్యనారాయణ, నాగార్జునరెడ్డి, రవీందర్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
మంచాల : వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖాన, ప్రైవేటు దవాఖాన, అనాథాశ్రమంలో నాయకులు పండ్లు పంపిణీ చేశారు. మంచాల వసతి గృహంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పనిచేశారన్నారు. చెన్నారెడ్డి గూడ, మంచాల ప్రభుత్వ పాఠశాలలో సీఎం జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, ఎంపీపీ నర్మద, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు రాము, జంగయ్య, శ్రీశైలం, మహేందర్, వెంకటేశ్, వేణు, రంజిత్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు : సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని కొత్తూరు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ నాయకులు మంగళవారం సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మూడు రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో టీఆర్ఎస్ కొత్తూరు మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొస్గి భగవద్గీత ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, టీఆర్ఎస్ నాయకులు కొత్తూరు పీహెచ్సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ కొస్గి శ్రీనివాసులు, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్యాదవ్, టీఆర్ఎస్ మున్సిపాలిటీ ఇన్చార్జి యాదగిరి, యాదయ్య, గోవింద్రెడ్డి, రవినాయక్, కరోళ్ల లక్ష్మయ్య, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
కొందుర్గు : కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలంలో మూడు రోజుల పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు హఫీజ్, శ్రీధర్రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, పీఏసీఎస్ డైరెక్టర్ జబ్బార్, ఎంపీటీసీ రాములు, ఇస్మాయిల్, గౌస్, నరేశ్, వీరయ్య, మోహన్రెడ్డి, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.