కొడంగల్, డిసెంబర్ 13: నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, తండాలకు రోడ్డు సౌక ర్యాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. మంగళ వారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎక్కచెరువుతండా గ్రామ పంచాయతీకి బీటీ రోడ్డు మంజూరుతో ఎమ్మెల్యేను గిరిజనులు ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలి పా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం పలుగురాళ్లతండా గ్రామ పంచా యతీ పరిధిలోని ఎక్కచెరువుతండా, గోప్యానాయక్ తండాలను కలుపుతూ మూడు కిలో మీటర్ల దూరంతో రూ.కోటి 55లక్షలతో బీటీ రోడ్డు మంజూరైనట్లు తెలిపారు. ఎక్కచెరువు తండా నుంచి చిల్ముల్వైల్వార్ 2.5 కిలోమీటర్ల దూరంతో రూ. కోటి 50లక్షలతో బీటీ రోడ్డు మంజూరైనట్లు పేర్కొన్నారు.
త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేయించి రోడ్డు పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలుగురాళ్లతండా, ఎక్కచెరువు తండా, గోప్యానాయక్తండా వాసులు పాల్గొన్నారు. బీటీ రోడ్డు మంజూరు సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో దేశ్యానాయక్, టీటీ రాములు, శంకర్నాయక్, దత్తునాయక్, నెహ్రూనాయక్, గోపాల్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ
పట్టణంలోని శ్రీ బండల ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో నిర్మించనున్న అయ్యప్ప ఆలయ స్థలంలో ఎమ్మెల్యే నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అయ్యప్ప మహా పడిపూజా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్రావు యాదవ్, పీఏసీఎస్ అద్యక్షుడు కటకం శివ కుమార్, విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్లు సయ్యద్ అంజద్, పకీరప్ప, వెంకట్రెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణతో పాటు టీఆర్ఎస్ నాయకులు నరోత్తంరెడ్డి, రమేష్బాబు, అయ్యప్ప భక్తులు డా.రవీంద్రయాదవ్, శ్రీనివాస్గౌడ్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య ఉప కేంద్రానికి శంకుస్థాపన
గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం దుద్యాల మండల కేంద్రంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించే ఆరోగ్య ఉప కేంద్రానికి శంకుస్థాపన చేసి తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమా వేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతుల కల్పిం చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నదని, నాణ్యమైన వైద్యాన్ని పేదలకు చేరువ చేస్తుందని అన్నారు. గ్రామాల్లోని యువతలో క్రీడాసక్తిని పెంపొందించడానికి ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నదని, యువత వీటిని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో నైపుణ్యం సాధించాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఖాజా, ఎంపీటీసీ ఎల్లప్ప, దుద్యాల మండల బీఆర్ ఎస్ అధ్యక్షుడు చాంద్పాషా, తాలుకా బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు నరేష్గౌడ్, పార్టీ నాయకులు దేశ్యానాయక్, బాబర్, బసిరెడ్డి, కవిత పాల్గొన్నారు.