చేవెళ్ల రూరల్ : విజయ దశమి పండుగను పురస్కరించుకుని ఎంపీ రంజిత్రెడ్డికి పలువురు టీఆర్ఎస్ నాయకులు శుభాకంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఎంపీ రంజిత్రెడ్డిని ఆయన నివాసంలో కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, సీనియర్ నాయకులు మిట్ట వెంకట రంగారెడ్డి, రామేశ్వర్ రెడ్డి, భూపతిరెడ్డి ఉన్నారు.