తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ ఆనారోగ్యానికి గురయ్యారు. వైద్యం కోసం బాధితుని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను ఆశ్రయించారు. ఎమ్మెల్యే బాధితుని కుటుంబ సభ్యుల చేత ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రమేశ్కు రూ. 60వేల విలువ గల చెక్కు మంజూరైంది.
మంజూరైన చెక్కును ఆదివారం బాధితుల కుటుంబ సభ్యులకు అందించారు. అదే విధంగా గ్రామానికి చెందిన మాణిక్యం రెడ్డికి రూ. 30వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.