హయత్నగర్ రూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలను అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారంలో యాదగిరి, కవిత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం భారీగా డబ్బు ఖర్చయింది. దీంతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా యాదగిరికి రూ. 40వేలు, కవితకు రూ. 25వేలు మంజూరయ్యాయి.
కౌన్సిలర్ రమావత్ పరశురాం సమక్షంలో బాధితుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కిషన్రెడ్డి చెక్కులు అందజేశారు. ఎమ్మెల్యేకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.