కేశంపేట : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం అల్వాల గ్రామానికి చెందిన సురు లలిత అనే మహిళ కుటుంబసభ్యులకు శనివారం 41వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. అనారోగ్యంతో ఆసుప్రతిలో చికిత్సలు చేయించుకున్నలలిత ఆర్థిక సహాయం కోసం ఎమ్మెల్యేను ఆశ్రయించగా ఆయన సీఎం సహాయనిధి నుంచి నిధులు మంజూరు చేయించారు.
చెక్కును అందుకున్న లలిత కుటుంబసభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కొత్తపేట సర్పంచ్ నవీన్కుమార్, టీఆర్ఎస్ నాయకులు తిరుమలరెడ్డి శ్రీనివాస్, కృష్ణయ్య, సుధాకర్, రాజు, రాంచందర్ పాల్గొన్నారు.