మంచాల : మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన నర్ల సత్తయ్య వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి రూ. 38వేలు మంజూరు అయ్యాయి. కాగా అట్టి చెక్కును శనివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి బాధితుడికి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, ప్రధానకార్యదర్శి బహదూర్, టీఆర్ఎస్ నాయకులు పరమేశ్, అశోక్, శివకుమార్, పృథ్వీధర్రెడ్డి, అమరేందర్రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీరాములు, పద్మారెడ్డి పాల్గొన్నారు.