ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కప్పాడు గ్రామానికి చెందిన చతాల చంద్రయ్య అనారోగ్యంతో ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందాడు. ఎక్కువ మొత్తంలో ఖర్చు కావడంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి రూ. 60వేలు మంజూరయ్యాయి. అట్టి చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.
గతంలో ఏ ప్రభుత్వాలు కూడా సీఎం సహాయనిధిని ఇంత పెద్ద ఎత్తున అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్రెడ్డి, ఉపసర్పంచ్ ఎండీ మునీర్, నాయకులు సతీష్గౌడ్, సామల శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జలందర్గౌడ్ ఉన్నారు.