తుర్కయాంజాల్ : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స చేయించుకొని ఆయా గ్రామాల స్థానిక టీఆర్ఎస్ నాయకులను బాధితులు సంప్రదించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా చూడాలని కోరారు. వారు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా కృషి చేశారు. ఈ మేరకు వచ్చిన చెక్కును సత్తయ్య లబ్ధిదారులకు అందజేశారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన సూర్యకళకు రూ. 56వేలు, ఉప్పరిగూడకు చెందిన మల్లారెడ్డికి రూ. 34వేలు, గొరిగె మహేష్కు రూ. 12వేల చెక్కులను డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య శనివారం తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం అన్నారు. ఆపదల్లో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ ఎంతో దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొండ్రు శ్రీనివాస్, ఏనుగు అయ్యప్ప రెడ్డి, గొరిగె ముత్యాలు, గొరిగె దయాకర్ పాల్గొన్నారు.