షాద్నగర్ : అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఓ వరంగా మారిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం రాత్రి షాద్నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధిని లబ్ధిదారులు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టణానికి చెందిన శ్రీనివాసరావుకు రూ. 60వేలు, చీపిరి సత్యనారాయణ యాదవ్కు రూ. 22 వేలు, స్వాతికి రూ. 56 వేలు, సయ్యద్ సాజిద్కు రూ. 60వేలు, మనోహర్రాజుకు రూ. 60వేలు, గఫ్పార్కు రూ. 26వేల చెక్కులను అందజేశామని చెప్పారు.
పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.