ఇప్పటికే లక్షా 50వేల బ్యాగులు సేకరణ
మరో 80 వేల బ్యాగులు వచ్చే అవకాశం
కొందుర్గు, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం చేస్తున్న ప్రతి ప్రయత్నం ఎంతో సఫలీకృతం అవుతున్నది. గతంలో రైతులు పండించిన పంటలు మార్కెట్లకు వెళ్లి వారు చెప్పిన ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో అమాయకులైన రైతులను దళారులు నిండా ముంచేవారు. వారు చెప్పిన ధరతోపాటు వారు అడిగినంత కమీషన్ చెల్లించి వారు. దీంతో రైతులు వేసిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోగా ధాన్యంలో కోతలు విధించి నట్టేట ముంచేవారు. రైతులు పండించిన పంటల విక్రయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించిన ప్రభుత్వం దారికి మద్దతు ధర కల్పించి ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు, మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసేందుకు రంగం సిద్దం చేసింది. దీంతో రైతులు పండించి ధాన్యంలో దళారీల కమీషన్ లేకుండా నేరుగా అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించన ధరతో తమ ఖాతాల్లో డబ్బులు జమ అవుతు న్నా యి. మద్యవర్తుల ప్రమేయం లేకుండా డబ్బులు తమ ఖాతాల్లో జమ కావడం వల్లన ఎంతో మేలు జరుగుతుందని రైతులు భావిస్తున్నారు.
వాతావరణం అనుకూలించడంతో..
ఉమ్మడి కొందుర్గు మండలంలో మొత్తం 46 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. అన్ని గ్రామ పంచాయతీల్లో ఎక్కువ శాతం వర్షాకాంలో వరి పంట ఎక్కువగా సాగు చేస్తారు. వర్షాకాలంలో 6వేల ఎకరాల వరకు సాగు అవుతున్నది. గత సంవత్సరం వర్షాలు బాగా కురవడం వల్లన గ్రామాల్లోని చెరువు, కుంటలు నిండి భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దీంతో రైతుల బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లు వచ్చాయి. దీంతో వరి ఎక్కువ శాతం సాగు చేశారు. ప్రతి సంవత్సరం నాలుగు, ఐదు వేల ఎకరాలు వరి సాగు చేసే రైతులు యాసంగిలో 9వేల ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. వాతావరణం సానుకులంగా ఉండడం వల్లన రైతుల అంచనాలకు మించి పంట దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్లన రైతులు దళారీల వద్ద మోసపోకుండా తమ ధాన్యాన్ని నేరుగా పభుత్వానికి అమ్ముకుంటున్నారు.
అంచనాలకు మించి …
కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలంలో వరి పంట అంచనాలకు మించి వచ్చింది. మండలంలో లక్షా 50వేల బ్యాగులతో వరి ధాన్యాన్ని కొనుకోవచ్చని భావించిన ప్రాథమిక వ్యవసాయ కేంద్రం అంచనా తారుమారు అయింది. మండలంలో ఇప్పటికే లక్షా యాభైవేల బ్యాగుల వరి ధాన్యాన్ని సేకరించినట్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారులు తెలిపారు. మరో 80వేల బ్యాగుల వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు లక్షా 54వేల గన్నీ బ్యాగుల వచ్చాయని మరో 80వేల గన్నీ బ్యాగులు రావాల్సి ఉందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గల రైతుల వద్ద నుంచి వరి ధాన్యాన్ని తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.
మొత్తం కొనుగోలు చేస్తాం
ఉమ్మడి కొందుర్గు మండలంలోని అన్ని గ్రామా ల్లో గల వరి ధాన్యాన్ని మొత్తం కొనుకోలు చేసేందుకు కృషి చేస్తున్నాం. అంచానాలకు మించి వరి దిగుబడి కావడం వల్లన కొంత గన్నీ బ్యాగుల కొరత ఏర్పడింది. గన్నీ బ్యాగుల కోసం ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం. ప్రభు త్వం నుంచి వస్తున్న గన్నీ బ్యాగులను రైతులకు అందిస్తున్నాం. మరో 80వేల గన్నీ బ్యాగుల కోసం ప్రతిపాదనలు పంపాం. రెండు రోజుల్లో రైతులందరికీ గన్నీ బ్యాగులు అందజేస్తాం. మొత్తం వరి ధాన్యాన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొనుగోలు చేస్తాం.
చిటె్ంట దామోదర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఉమ్మడి కొందుర్గు మండలం.