యాచారం : మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలోని నజ్దిక్సింగారం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. నజ్దిక్సింగారం గ్రామానికి చెందిన బండారు లక్ష్మమ్మ(73) అనే వృద్ధురాలు ఈ నెల 20న ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెకు ఒక్కతే కూతురు. తన కూతురు అనిత నిత్యం ఫోన్ చేసి మాట్లాడేది. 20వ తేది నుంచి లక్ష్మమ్మ ఫోన్ లేపకపోవడంతో అనిత 21న నజ్దిక్సింగారం వచ్చి చూసింది. తల్లి ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె చుట్టు పక్కల వాళ్లను అడిగినా, బంధువులకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె శనివారం పోలీసులను ఆశ్రయించింది. తన తల్లిని వెతికి పెట్టాలని ఫిర్యాదులో పేర్కొంది. కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మమ్మ సమాచారం తెలిసిన వారు 9490617242కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.