శంకర్పల్లి డిసెంబర్ 1 : గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయడానికే తెలంగాణ ప్రభుత్వం గ్రామగ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందని రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు. గురువారం శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలోని క్రీడా ప్రాంగణాలు, పల్లెప్రకృతి వనాలు, ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. క్రీడా ప్రాంగణాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రీడా ప్రాంగణాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని అందంగా తయారు చేసినందుకు సర్పంచ్, అధికారులను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య, సర్పంచ్ సుమిత్ర, ఈవోఆర్డీ గీత, ఏపీవో నాగభూషణం పాల్గొన్నారు.