యాచారం : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లితండాకు చెందిన బీజేపీ నాయకుడు శ్రీనునాయక్ ఆ పార్టీని వీడి మంగళవారం ఎమ్మెల్యే సమక్షంలో తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరాడు. ఎమ్మెల్యే అతనికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మట్లాడుతూ మండలంలో టీఆర్ఎస్ మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాల న్నారు. ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు పోయి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జగదీష్నాయక్, టీఆర్ఎస్ నాయకులు మల్లేశ్, కిషన్నాయక్ ఉన్నారు.