రంగారెడ్డి జిల్లాలో గణత్రంత వేడుకలను సంబురంగా నిర్వహించారు. బుధవారం ఆయా మండలాల్ల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ షాద్నగర్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో జెండాను ఎగురవేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన జెండా వేడుకల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. పీఎంఆర్ జనరల్ దవాఖానలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, మొయినాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పాల్గొన్నారు. ఆయా గ్రామాలు, పాఠశాలల్లో సర్పంచులు, ఉపాధ్యాయులు వేడుకలు చేశారు. పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. – న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ, జనవరి 26