బొంరాస్పేట, ఫిబ్రవరి 25: గ్రామాల్లోని అంతర్గత రహదారులకు మహర్దశ పట్టనుంది. అధ్వాన్నంగా ఉన్న అంతర్గత రహదారులను సీసీగా మార్చడానికి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నిధులు మంజూరు చేసింది. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్ మండలానికి రూ.1.18 కోట్లు, బొంరాస్పేట మండలానికి 1.28 కోట్లు, దౌల్తాబాద్ మండలానికి రూ.1 కోటి సీసీ రోడ్ల నిరాణానికి మొత్తం రూ.3.46 కోట్లు మంజూరయ్యాయి. బొంరాస్పేట మండలంలో అత్యధికంగా గిరిజన తండాల కు సీసీ రోడ్లను మంజూరు చేశారు. నిర్మాణ పనులను కొన్ని గ్రామాలు,తండాలలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఇప్పటికే ప్రారంభించారు. మార్చి నెలాఖరు వరకు పనులను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించడంతో పనులు చురుకుగా సాగుతున్నాయి. సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే అంతర్గత రహదారులు అభివృద్ధికానున్నాయి.
బొంరాస్పేట మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.28 కోట్లు మం జూరు చేసింది. ఎక్కచెరువుతండాకు రూ.8 లక్షలు, టేకులగడ్డతండాకు రూ.5 లక్షలు, కొత్తూరుకు రూ.8 లక్షలు, సండ్రకుంటతండాకు రూ.4 లక్షలు, మూడుమామిళ్లతండాకు రూ.3 లక్షలు, బాపన్చెరువుతండాకు రూ.3 లక్షలు, సూర్యానాయక్తండాకు రూ.3 లక్షలు, మహాంతిపూర్కు రూ. 3 లక్షలు, వడిచెర్లకు రూ. 8 లక్షలు, లోతుకుంటతండాకు రూ. 3 లక్షలు, మదన్పల్లికి రూ. 5 లక్షలు, ఎనికేపల్లి కి రూ.4 లక్షలు, ఎన్నెమీదితండా(కొత్తూరు)కు రూ. 4 లక్ష లు, నాందార్పూర్కు రూ. 4 లక్షలు, హంసాన్పల్లికి రూ. 4 లక్షలు, మేడిచెట్టుతండాకు రూ. 5 లక్షలు, ఈర్లపల్లికి రూ. 4 లక్షలు, బాపల్లితండాకు రూ. 3 లక్షలు, చెట్టుపల్లితండాకు రూ. 3 లక్ష లు, మదన్పల్లితండా కు రూ.5 లక్షలు, బురాన్పూర్కు రూ. 5 లక్షలు, బొట్లవానితండాకు రూ. 5 లక్షలు, ఎన్నెమీదితండా(వడిచెర్ల)కు రూ. 4లక్షలు, కాకర్లగండితండాకు రూ. 3 లక్షలు, తుంకిమెట్లకు రూ. 4 లక్షలు, రోటిబండతండాకు రూ. 4 లక్షలు, చౌదర్పల్లికి రూ.4 లక్షలు, లింగన్పల్లికి రూ.3 లక్షలు, నాస్కంపల్లికి రూ.3 లక్షలు, గట్టెగానితండాకు రూ.5 లక్షలు మంజూరయ్యాయి.
కొడంగల్ మండలంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.1.18 కోట్లు మంజారయ్యాయి. అంగడిరాయిచూరుకు రూ.2 లక్ష లు, అన్నారంకు 5 లక్షలు, బోనమ్మతండాకు రూ.4 లక్షలు, చిన్ననందిగామకు రూ.4 లక్షలు, టేకుల్కోడ్కు రూ. 5 లక్షలు, పర్సాపూర్కు రూ. 5 లక్షలు, పలుగురాళ్లతండాకు రూ.4 లక్షలు, చిట్లపల్లికి రూ.4 లక్షలు, బోయపల్లితండాకు రూ.4 లక్షలు, పాటిమీదిపల్లికి రూ.5 లక్షలు, హుస్సేన్పూర్కు రూ.5 లక్షలు, అప్పాయిపల్లికి రూ.10 లక్షలు, ఖాజాఅహ్మద్పల్లికి రూ.5 లక్షలు, ఉడిమేశ్వరంకు రూ.4 లక్షలు, కస్తూర్పల్లికి రూ.4 లక్షలు, పెద్దనందిగామకు రూ.4 లక్షలు, ఇంధనూరుకు రూ.4 లక్షలు, సంగాయిపల్లికి రూ.10 లక్ష లు, రావులపల్లికి రూ.4 లక్షలు, లక్ష్మీపల్లికి రూ.10 లక్షలు, నాగారంకు రూ.4 లక్షలు, ఆలేడుకు 5 లక్షలు, పోచమ్మతండాకు రూ.3 లక్షలు మంజూరయ్యాయి.
దౌల్తాబాద్ మండలంలోని చంద్రకల్కు రూ.14 లక్షలు, గుండాలకు రూ.4 లక్షలు, సుల్తాన్పూర్కు రూ. 4 లక్షలు, నంద్యానాయక్తండాకు రూ.4 లక్షలు, ర్యాలగుట్టతండాకు రూ.4 లక్షలు, బిచ్చాలకు రూ. 5 లక్షలు, సంగాయిపల్లికి రూ. 4 లక్షలు, దేశాయిపల్లికి రూ. 4 లక్షలు, కుప్పగిరికి రూ. 3 లక్షలు, బండివాడకు రూ.3 లక్షలు, అల్లాపూర్కు రూ. 5.50 లక్షలు, సూరాయిపల్లికి రూ.5 లక్షలు, ఊరకుంటకు రూ.3 లక్షలు, లొట్టికుంటతండాకు రూ.4 లక్షలు, నాగసార్కు రూ.8 లక్షలు, గుండేపల్లికి రూ.5.40 లక్షలు, చెల్లాపూర్కు రూ.4 లక్షలు, దౌల్తాబాద్కు రూ. 13 లక్షలు, యాంకికి రూ.4 లక్షలు మంజూరయ్యాయి.
తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన తరువాత నిధులు మంజూరై అభివృద్ధి చెందుతున్నాయి. ఇ్పపటికే తండాలలో పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పుడు సీసీ రోడ్ల నిర్మాణానికి ఉపాధిహామీ నిధులు మంజూరు కావడం సంతోషం. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తండాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
-నెహ్రూనాయక్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బొంరాస్పేట
కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలకు 109 సీసీ రోడ్లు మంజూరయ్యాయి. వీటిని మార్చి నెలాఖరుకు పూర్తి చేయ డానికి కృషి చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రా రంభ మ య్యాయి. మిగతా వాటిని కూడా ప్రారంభించి గడువులోగా పూర్తి చేస్తాం. ఈ నిధులతో అంతర్గత రహదారులు అభివృద్ధిచెంది ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయి.
– రవికిరణ్, పంచాయతీరాజ్ ఏఈ