నందిగామ, ఫిబ్రవరి 17 : రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఉచితంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ ఫోన్లను గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 27 మందికి జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్తో కలిసి స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆశాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు ప్రియాంకగౌడ్, మధుసూదన్రెడ్డి, సర్పంచ్లు వెంకట్రెడ్డి, అశోక్, రమేశ్, స్వామి, రాజునాయక్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, డిప్యూటీ డీఎం హెచ్వో దామోదర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తూరు రూరల్ : ప్రజలు మెచ్చిన నాయకుడు, అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయ్యయాదవ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో టీడీపీ నాయకుడు, మాజీ జడ్పీటీసీ చిర్ర మల్లయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గులాబీకండువ కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుసూదన్రెడ్డి, జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ రవీందర్, కౌన్సిలర్ శ్రీను, ఆయా గ్రామాల సర్పంచ్లు సత్తయ్య, సాయిలు, రవినాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పద్మారావు పాల్గొన్నారు.