కేశంపేట, ఫిబ్రవరి 16 : మండలంలోని కొండారెడ్డిపల్లి-పోమాల్పల్లిల పరిధిలో వెలసిన శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి కల్యాణాన్ని నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. దేవతామూర్తులకు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సంబరాజు పద్మనాభరావు-వాణిశ్రీ, మాజీ జడ్పీటీసీ పల్లె నర్సింగ్రావు-గిరిజ దంపతులు పట్టువస్ర్తాలను సమర్పించారు. కల్యాణాన్ని తిలకించేందుకు ఆయా గ్రామాల ప్రజలు, భక్తులు తరలివచ్చారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీ విశాల, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, సర్పంచ్ నవీన్కుమార్, నిదురం కృష్ణయ్య, అభివృద్ధి కమిటీ సభ్యులు నిదురం అంజయ్యయాదవ్, టీఆర్ఎస్ నాయకులు యాదగిరిరావు, శ్రావణ్రెడ్డి, పర్వత్రెడ్డి, వేణుగోపాలాచారి, భూపాల్రెడ్డి, తిరుమలరెడ్డి శ్రీనివాస్, ప్రేమ్కుమార్గౌడ్, రమేశ్యాదవ్, వెంకటేశ్, బండ కృష్ణయాదవ్, దశరథ్, నరేందర్ పాల్గొన్నారు.
మంచాల, ఫిబ్రవరి16 : మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి, రుక్మిణి, సత్యభామల కల్యాణాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య నిర్వహించారు. ఆరుట్ల గ్రామంలో మంగళవారం రాత్రి సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కావలిశ్రీనివాస్, చీరాల రమేశ్, ఉపసర్పంచ్ జంగయ్యగౌడ్ పాల్గొన్నారు.
యాచారం, ఫిబ్రవరి 16 : మండలంలోని కొత్తపల్లి, తక్కళ్లపల్లి గ్రామాల ప్రజలు కొంగు బంగారంగా కొలిచే వేంకటేశ్వరస్వామి గుట్టపై బుధవారం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. పురోహితులు ప్రవీణ్శర్మ అభిషేకం చేశారు. కొత్తపల్లి ఎంపీటీసీ సుమతమ్మ, తక్కళ్లపల్లి సర్పంచ్ సంతోష, కొత్తపల్లి మాజీ సర్పంచ్ లత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహిక వ్రతాలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను ఊరేగించారు. అనంతరం భక్తులకు ఆర్టీసీ ఉద్యోగులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పొద్దుటూరి రామలింగయ్య ఫౌండేషన్ సభ్యులు గుట్టపై తాగునీటి వసతిని కల్పించారు.
కడ్తాల్, ఫిబ్రవరి 16 : మండల కేంద్రంలో కొలువైన లక్ష్మీచెన్నకేశవస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయంలో కుంకుమార్చన, సహస్రనామ పారాయణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం రాత్రి 11 గంటలకు పుష్పమాల సేవ (చిన్న రథోత్సవం)ను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఆంజనేయులు, నరేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, పూల శంకర్, కిరణ్గౌడ్, సాయిప్రభు, అశోక్రెడ్డి, అర్చకులు వెంకటేశ్వరశర్మ, శ్రీమన్నారాయణ, వేణుగోపాల్, శ్రీధర్ పాల్గొన్నారు.
శంకర్పల్లి, ఫిబ్రవరి 16 : మాఘ పౌర్ణమి సందర్భంగా శంకర్పల్లి మండలంలోని పలు దేవాలయాలలో బుధవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని చందిప్ప మరకత శివాలయం, చిన్న శంకర్పల్లిలోని రాజరాజేశ్వర దేవాలయాల్లో పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. చిన్న శంకర్పల్లిలో మున్సిపల్ 14వ వార్డు కౌన్సిలర్ జూలకంటి శ్వేతాపాండురంగారెడ్డి అన్నదానం చేశారు.
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 16 : మండల పరిధిలోని మంగల్పల్లి మహమ్మాయిదేవీ అమ్మవారి కల్యాణ మహోత్సవం, రథోత్సవం బుధవారం కన్నుల పండుగగా జరిగింది. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆదిబట్ల మున్సిపల్ అధ్యక్షుడు కొప్పు జంగయ్య, కౌన్సిలర్లు కృష్ణంరాజు, మౌనిక, ఆలయ కమిటీ చైర్మన్ నారని నర్సింహగౌడ్, పురోహితులు పాల్గొన్నారు.