ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 16 : కరోనా సమయంలో ప్రజలకు సేవలందించటంలో ఆశాల సేవలు వెలకట్టలేనివని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆశావర్కర్లకు ఉచితంగా అందజేస్తున్న స్మార్ట్ఫోన్లను బుధవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఆశావర్కర్లు చేపడుతున్న సేవలు మరింత పకడ్బందీగా అందించాలని ప్రభుత్వం స్మార్ట్ఫోన్లను అందజేస్తున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సోకుతున్న వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఇతర సమాచారం అందించేందుకు సులువుగా ఉంటుందన్నా రు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో నాగజ్యోతి, ఎంపీపీ కృపేశ్, ఎలిమినేడు వైద్యాధికారి అభిరాం, వైస్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్రెడ్డి, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
మంచాల : మంచాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 19 మంది ఆశావర్కర్లకు ఎంపీపీ స్మార్ట్ ఫోన్లను అందజేశారు. కార్యక్రమంలో ఈవోఆర్డీ మధుసూదనాచారి, వైద్య సిబ్బంది సతీశ్ పాల్గొన్నారు.
కడ్తాల్ : ప్రజారోగ్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా అన్నారు. బుధవారం మండల పరిధిలోని మైసిగండి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు తులసీరాంనాయక్, యాదయ్య, ఎంపీహెచ్ఈవో సుధీర్బాబు, సూపర్వైజర్ ఎల్లమ్మ, ఫార్మసిస్ట్ జంగయ్య, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
మొయినాబాద్ : ఆశా వర్కర్ల కుటుంబాలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ వేతనాలు పెంచారని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ అన్నారు. రూ.10 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్లను బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనితారెడ్డి, ఎంపీడీవో సంధ్య, ఆర్ఐ పాండుగౌడ్, సర్పంచ్ కుమార్, టీఆర్ఎస్ నాయకుడు నర్సింహారెడ్డి, హెల్త్ సూపర్ వైజర్లు ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
కేశంపేట : గ్రామాల్లో వైద్య సేవలందిస్తున్న ఆశావర్కర్లకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎంపీపీ రవీందర్యాదవ్ అన్నారు. 45 మంది ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విశాల, సర్పంచ్ వెంకట్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, డాక్టర్ సుమంత్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
యాచారం : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 36 మంది ఆశావర్కర్లకు ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ స్మార్ట్ఫోన్లను అందజేశారు. కొవిడ్ సమయంలో ఆశావర్కర్లు చేసిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీధర్రెడ్డి, మండల వైద్యాధికారి ఉమాదేవి, ఆశావర్కర్లు తదితరులున్నారు.
ఆమనగల్లు : ఎంపీపీ అనిత, మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్ ఆధ్వర్యంలో ఆమనగల్లు పట్టణంలోని సీహెచ్సీలో స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట్రాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ దుర్గయ్య, సర్పంచ్ శ్రీను, వైద్య సిబ్బంది తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.