షాద్నగర్, ఫిబ్రవరి11: పల్లెల అభివృద్ధే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం ఫరూఖ్నగర్ మండలం కొండన్నగూడ, నాగులపల్లి, చిన్న చిల్కమర్రి, చిలకమర్రి, కాశిరెడ్డిగూడ, కుందేలుకుంట, నేరళ్లచెరువు, మధురాపూర్, గంట్లవెల్లి, దేవునిబండతండా, కమ్మదనం గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం తనవంతుగా చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం చేశారు. పల్లెల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసిందన్నారు. 13 గ్రామాల్లో సీసీ రోడ్ల ఏర్పాటుకు రూ. 1.84 కోట్ల నిధులను ఖర్చుచేస్తున్నామని తెలిపారు. పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, బీటీ రోడ్డు, ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా వంటి వసతులు వచ్చాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసానిస్తుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను శుక్రవారం అందజేశారు. బుచ్చిగూడ గ్రామానికి చెందిన అమృతకు రూ. 60వేలు, సూరయ్యకు రూ. 60వేలు, మధురాపూర్కు చెందిన శ్రీనివాస్కు రూ. 60వేలు, చిల్కమర్రికి చెందిన రంగయ్యకు రూ. 60వేలు, చెల్క చిల్కమర్రికి చెందిన రాజేందర్రెడ్డికి రూ. 60వేలు, వెంకన్నగూడ తండాకు చెందిన రాములుకు రూ. 30వేలు, వెల్జర్లకు చెందిన జ్యోతికి రూ. 28వేలు, వెంకటాపురం తండాకు చెందిన రవికి రూ. 18వేలు, బూర్గుల గ్రామానికి చెందిన రామలింగానికి రూ. 12వేలు, కృష్ణయ్యకు మంజూరైన రూ. 9,500 చెక్కులను పంపిణీ చేశారు. ఆయన వెంట ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబాల్నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, నాయకులు ఉన్నారు.
సీఎం సహాయ నిధి పేదలకు వరమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ రైల్వే స్టేషన్కు చెందిన ఎండీ మిస్కిన్కు రూ. 60వేల చెక్కును శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం సహాయ నిధి వరంగా మారిందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ కొస్గి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకుడు దేవేందర్యాదవ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ విఠల్, మల్లాపూర్ మధు, భాస్కర్ పాల్గొన్నారు.