ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 11 : ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం భీమా పథకం కింద రూ.5లక్షలు అందజేసి ఆదుకుంటున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన గోరేటి నర్సింహ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, బాధిత కుటుంబానికి రైతుబీమా ద్వారా మంజూరైన రూ. 5లక్షల ఎల్వోసీని క్యాంపు కార్యాలయంలో ఆయన శుక్రవారం మృతుడి భార్య పద్మమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబాలకు రైతుబీమా పథకం కింద రూ.5లక్షలు అందజేసి వారి కుటుంబాలకు భరోసాను కల్పిస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాశ్చభాష, సర్పంచ్ బి. కృష్ణ, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కృష్ణ, మండల ప్రచార కార్యదర్శి శివలింగం, నాయకులు బాలరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. మంచాల మండలం బోడకొండ గ్రామానికి చెందిన జాటోతు బక్క అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతడి వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.3లక్షల ఎల్వోసీని వారి కుటుంబసభ్యులకు అందజేశారు. అదే విధంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన రమేశ్ నగరంలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించుకోగా, అతడికి మెరుగైన వైద్యం కోసం మంజూరైన రూ.90వేల చెక్కును శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ముత్యాల చిన్న పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని కాలనీలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెం కాలనీలో యాభై లక్షలతో దాతల సహకారంతో చేపట్టిన కమ్యూనిటీ హాలును ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని హంగులతో పేద వర్గాలకు పలు శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా ఈ భవనాన్నీ నిర్మించారని అన్నారు. త్వరలో పది లక్షల రూపాయలతో కాలనీలో తాగునీటి పైప్లైన్ వేయిస్తానని హామీ ఇచ్చారు. కాలనీలో మౌలిక వసతుల కల్పనకోసం మున్సిపాలిటీ ద్వారా నిధులు కేటాయించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతామన్నారు. అనంతరం కమిటీ సభ్యులు అతిథులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, పలు వార్డు కౌన్సిలర్లు, పసుమాముల మాజీ సర్పంచ్ కొత్తపల్లి జైపాల్రెడ్డి, కాలనీ అసొసియేషన్ గౌరవాధ్యక్షుడు రామ్మోహన్రావు, అధ్యక్షుడు గోవిందరెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, వాజిద్, కార్యదర్శులు ఉయ్యాల శివ, మజీద్, సభ్యులు వినోదరాజు, రవీందర్, సతీశ్ వెంకట్రెడ్డి, శ్రీనాథ్రెడ్డి పాల్గొన్నారు.