కేశంపేట, మార్చి 12 : భైర్ఖాన్పల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన ఎద్దులతో బండలాగుడు పోటీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పోటీలను స్థానిక ఎంపీపీ రవీందర్యాదవ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. పోటీల్లో పలు ప్రాంతాల నుంచి ఎద్దులతో పోటీదారులు పాల్గొన్నారు. పోటీలను చూసేందుకు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, జడ్పీటీసీ విశాల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, కొత్తూరు రూరల్ సీఐ సత్యనారాయణ, కేశంపేట ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.