తలకొండపల్లి, మార్చి 5 : సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన బాలమణికి రూ. 26 వేలు, కొండల్రెడ్డికి రూ. 58 వేలు, బల్సులపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తంకు రూ. 22 వేలు, కడ్తాల మండలం చల్లంపల్లి గ్రామానికి చెందిన యాదయ్యకు రూ. 60 వేలు, ఆమనగల్లు పట్టణానికి చెందిన సదానందానికి రూ.1.75 లక్షలు, మేడిగడ్డ తండా కు చెందిన ఇస్లావత్ తావుకు రూ. 32 వేలు, జేపీ నగర్కు చెందిన మల్లేశ్కు రూ. 3 లక్షల ఎల్వోసీని అందజేశారు.
కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు వరంలా మారిందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని చల్లంపల్లి గ్రామ పంచాయతీలోని వంపుగూడానికి చెందిన భారతమ్మకు రూ.28, 500, మాడ్గుల్ మండల కేంద్రానికి చెందిన అలివేలుకు రూ.14 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం హైదరాబాద్లో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పథకంతో పేద ప్రజలకు కార్పొరేట్ దవాఖానల్లో అత్యుత్తమ వైద్యం అందుతున్నదన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతున్నదని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య , ఉప సర్పంచ్ జైపాల్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గిరియాదవ్, నాయకులు పత్యానాయక్, భిక్షపతి, రాజేందర్ ఉన్నారు.
కొందురు : జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రంలో శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్ లబ్ధిదారులకు అందజేశారు. మండలంలోని అమ్మాపురం ఫయాజ్కు రూ. 60 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు బాబురావు, ఎంపీటీసీ మల్లయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ జబ్బార్, నాయకులు మల్లయ్య, రమేశ్, అజ్మీర్, సలీం, మోత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
హయత్నగర్ రూరల్ : పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ 17వ వార్డు పరిధి ఆర్కేనగర్లోని అబ్దుల్ ఖుతు, ఎం నిక్షిత కుటుంబాలకు రూ.20 వేల చొప్పున సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. ఆ చెక్కులను ఎమ్మెల్యే తరపున టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్రెడ్డి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. అంతకుముందు అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తిమ్మాయిగూడెంలో గౌస్కు రూ.24 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్లు కోటేశ్వర్రావు, పరశురాం, టీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, అనంతుల వెంకటేశ్వర్రెడ్డి, పాశం దామోదర్, విజయ్భాస్కర్రెడ్డి, యువజన విభాగం జనరల్ సెక్రెటరీ పాశం పవన్, కార్తీక్, గోపాల్గౌడ్ పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : కుంట్లూర్లోని పలువురికి సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు కళ్లెం ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్ కృష్ణారెడ్డి, హరిశంకర్, నాయకులు బలరాం, దామోదర్, రాము, శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్, శశి, హరి తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ : మండలంలోని అనాజ్పూర్ గ్రామానికి చెందిన జయమ్మకు రూ. 56వేలు, మజీద్పూర్ గ్రామానికి చెందిన సంజీవచారి, కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన గౌస్కు మంజూరైన రూ.24వేల చెక్కులను స్థానిక నాయకులతో కలిసి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్ రెడ్డి లబ్ధిదారులకు ఎమ్మెల్యే తరపున అందజేశాడు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిషన్గౌడ్, ప్రధాన కార్యదర్శి కోట వెంకట్రెడ్డి, అనాజ్పూర్ సర్పంచ్ కావలి రంగయ్య, ఎంపీటీసీ రాచపాక లావణ్య, కుత్బు ల్లాపూర్ సర్పంచ్ ముద్దం స్వరూప, మెట్టు సర్పంచ్ చెరుకు కిరణ్కుమార్గౌడ్, గౌరెల్లి సర్పంచ్ మల్లేశ్ పాల్గొన్నారు.