తుర్కయాంజాల్, మార్చి 3 : ప్రణాళికాబద్ధ్దంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడ 7, 8, 9,20వ వార్డుల్లో తుర్కయాంజాల్ 10, 11, 12, 21వ వార్డుల్లో సుమారు రూ.464.70 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. దశల వారీగా అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతోనే మున్సిపాలిటీ ప్రగతి సాధిస్తున్నదన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపి స్తే సహించేది లేదని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమష్టి భాగస్వామ్యంతోనే మున్సిపాలిటీ ప్రగతి సాధిస్తుందన్నారు. మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛత పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చెత్త రహిత మున్సిపాలిటీగా తుర్కయాంజాల్ను తీర్చిదిద్దేంద కు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ అనురాధ, వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరిత, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి, రంగారెడ్డి జిల్లా కౌన్సిలర్ల ఫోరం అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్లు రమావత్ కల్యాణ్ నాయక్, కొశిక ఐలయ్య, కౌన్సిలర్లు జ్యోతి, తాళ్లపల్లి సంగీత, వేముల స్వాతి, గుండా భాగ్యమ్మ, పుల్లగుర్రం కీర్తన, రవీందర్రెడ్డి, శ్రీలత, కుంట ఉదయశ్రీ, మేతరి అనురాధ, రొక్కం అనిత, రేవెల్లి హరిత, మర్రి మాధవి, కాకుమాను సునీల్, డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : బేడ బుడగజంగాల సంఘం రాష్ట్ర చైర్మన్ హన్మంతు, గౌరవ చైర్మన్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే కిషన్రెడ్డిని కలిశారు. బేడబుడగ జంగాల ఐక్యవేదిక భవన నిర్మాణానికి గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పసుమాముల గ్రామంలో 137 సర్వే నంబర్లో స్థలాన్ని కేటాయించారు. ఈ సర్వేనెంబర్లోని స్థలం భవన నిర్మాణానికి అనుకూలం గా లేనందున పక్కనే ఉన్న మరో సర్వే నంబర్లో ఒక ఎకరం స్థలంతో పాటు భవన నిర్మాణానికి రూ.కోటి మం జూరు చేయించాలని వారు ఎమ్మెల్యేను కోరారు. కార్య క్రమంలో హనుమంతు, నర్సింహ, కృష్ణ పాల్గొన్నారు.