కడ్తాల్, మార్చి 3 : పేద ప్రజల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన అబ్దుల్ రషీద్కు రూ.45 వేలు, ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన రాంచంద్రయ్యకు రూ.లక్ష సీఎం సహాయనిధి చెక్కులను గురువారం హైదరాబాద్లో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకంతో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి దవాఖానల్లో మెరుగైన వైద్యం లభిస్తున్నదని తెలిపారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బొప్పిడి గోపాల్, మాజీ జడ్పీటీసీ నర్సింహ, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ బాలకృష్ణ, నాయకులు లింగం, శ్రీశైలంయాదవ్, జమీర్, పాషా, ఖయ్యూం, అమీర్ పాల్గొన్నారు.
మంచాల : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. మండలంలో గురువారం 13 మందికి రూ. 7,78,500ల సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను నేరుగా లబ్ధ్దిదారుల ఇంటింటికెళ్లి ఎమ్మెల్యే కిషన్రెడ్డి తరపున అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మంది పేదప్రజలకు అండగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి బహదూర్, పీఏసీఎస్ చైర్మన్ పుల్లారెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, ఎంపీటీసీలు నర్సింగ్, అనిత, సుకన్య, సర్పంచ్లు జగన్రెడ్డి, పెంట్యానాయక్, బాల్రాజ్, అలివేలు పాల్గొన్నారు.