బొంరాస్పేట, మార్చి 2 : మండలంలోని గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేస్తానని, తండాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని సాలిండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మాలకుంటతండా భీమాశంకర్ శివాలయంలో రూ.1.80 లక్షల జిల్లా పరిషత్ నిధులతో వేసిన బోరును బుధవారం ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ చౌహాన్ అరణాదేశుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం శివాలయంలో ఎమ్మెల్యే పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనతండాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామన్నారు.
సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని చెప్పారు. తండాల్లో పల్లె ప్రగతి నిధులతో వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు, కంపోస్ట్షెడ్లు నిర్మించామని, త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించామని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి అన్నారు. మాలకుంటతండా నుంచి తొప్పెర్లగడ్డతండాకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, శివాలయం ఆవరణలో షెడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. శివాలయానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానికుడు హన్మంతునాయక్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు చాంద్పాషా, కోఆప్షన్ సభ్యుడు ఖాజా మైనుద్దీన్, ఎంపీటీసీలు నారాయణరెడ్డి, శ్రవణ్గౌడ్, సింగిల్విండో డైరెక్టర్ సుభాష్రావు, పార్టీ నాయకులు రామకృష్ణయాదవ్, సురేశ్, నర్సింహారాథోడ్, లచ్చప్ప పాల్గొన్నారు.