చేవెళ్లటౌన్, మార్చి 2 : దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి జాతరలో ఊరెళ్ల మాజీ సర్పంచ్ కుంచము పెంటయ్య, కు మారులు శివకుమార్, శ్రావణ్కుమార్, నరేశ్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదానం చేయ డం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని అన్నారు. అన్నిదానాలకన్నా అన్నదానం ఎంతో గొప్పదన్నారు. చేవెళ్ల వేంకటేశ్వర స్వామి దేవాలయానికి అధిక నిధులు కేటాయించి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో శ్రీహరి, కృష్ణయ్య, రమేశ్, నర్సిములు, ప్రభాకర్, మాణిక్య రెడ్డి, యూసుఫ్, రాజ్, విష్ణు, శ్రీను పాల్గొన్నారు.
మాడ్గుల : మండల కేంద్రంలోని శివాలయం, నాగిళ్ల గ్రామంలోని రామలింగేశ్వరస్వామి, ఆర్కపల్లి గ్రామంలో కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు , స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పూజలు చేశారు. ఉపవాసాలు ఉన్న భక్తులు జాగారాలు చేసి తెల్లవారు జామున ఆలయాలకు విచ్చేసి మొక్కులు చెల్లించారు. అన్నదాన కార్యక్రమా లు చేపట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి, సర్పంచ్లు వెంకటేశ్వర్లుగౌడ్, జంగయ్య, రమేశ్రెడ్డి, జంగయ్య, డైరెక్టర్ సుభాశ్ పాల్గొన్నారు.