పరిగి, మార్చి 1: పరిగి మున్సిపల్లో రూ.15 కోట్లతో అభివృద్ధ్ది పనులను చేపడుతున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. టెలిఫోన్ ఎక్సేంజ్ నుంచి జడ్పీహెచ్ఎస్ నెం.1 వరకు బీటీ రోడ్డు పనులను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. అదేవిధంగా గంజ్ రోడ్డులోనూ ఇరువైపులా మురికి కాలువలను నిర్మించి డివైడర్ ఏర్పాటు చేయాలని, బీటీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాల తొలగింపు పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలోని ఉడెన్ ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో దోమ జడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
దోమ, మార్చి1: ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకంతో రైతుల కుటుంబాలకు భరోసా అందుతున్నదని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. మండలంలోని గుండా ల గ్రామానికి చెందిన కుర్వ రాములు ఇటీవల మృతి చెంద గా.. రైతుబీమా పథకం కింద మంజూరైన రూ. ఐదు లక్షల బ్యాంక్ స్టేట్మెంట్ను మృతుడి భార్య వెంకటమ్మకు ఎమ్మె ల్యే మంగళవారం అందజేశారు. అనంతరం ఆయన మహా
శివరాత్రిని పురస్కరించుకుని గ్రామంలో జరిగిన శివపార్వతుల కల్యాణంలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. కార్య క్రమంలో దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్కుమార్, సర్పంచ్ సుజాత,ఉప సర్పంచ్ లాల్యానాయక్, జగత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.