మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్, ఆమనగల్లు నియోజకవర్గాల వ్యాప్తంగా ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. ఉదయం ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ఆలయాల్లో అభిషేకాలు, హోమం, అర్చనలు తదితర పూజలు నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం, మార్చి 1 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు ఉపవాస దీక్షలు పాటిస్తూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రసిద్ధిచెందిన ఇబ్రహీంపట్నం శివాలయం, త్రిశక్తిదేవాలయం, నందివనపర్తి నందీశ్వరదేవాలయం, రాచకొండ స్వయంభూ శివలింగం, నోముల మల్లికార్జునస్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహాశివరాత్రి పర్వదినాన ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. మధ్యా హ్నం ఉపవాస దీక్షలు విరమించే భక్తులు కూడా ఆలయాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నోముల మల్లికార్జునస్వా మి దేవాలయానికి స్థానిక గురుకుల విద్యాపీఠానికి చెందిన సుమారు 300 విద్యార్థులు చేరుకుని పూజలు చేశారు.
షాద్నగర్టౌన్ : నియోజకవర్గంలో హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి భక్తులు ఉపవాసలు చేస్తూ లింగేశ్వరుడిని దర్శనం కోసం క్యూలు కట్టారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచే భక్తులు శివున్ని స్మరిస్తూ ఉపవాస దీక్షలు చేపట్టారు.
ఆమనగల్లు : మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆమనగల్లు మండలంలోని అయ్యసాగర్క్షేత్రం, కడ్తాల మండలంలోని మైసిగండి శివాలయం, తలకొండపల్లి మండలంలోని మల్లప్పగుట్ట, మాడ్గుల మండలంలోని ఆర్కపల్లి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. మల్లప్పగుట్ట, మైసిగండి, అయ్యసాగర్క్షేత్రంలో కనుల పండువగా శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వేర్వేరుగా పూజలు నిర్వహించారు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. అతి పవిత్ర పుణ్యక్షేత్రమైన మరో కాశీ శైవ క్షేత్రంగా విరజిల్లుతున్న మండలంలోని ఉత్తర రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరమ శివుడికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రంతో స్వామి వారిని పూజించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్యాంసుందరాచారి, సర్పంచ్ సంపత్కుమార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. ఏసీపీ కుషాల్కర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును నిర్వహించారు.
షాబాద్ : నియోజకవర్గ వ్యాప్తంగా మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ఆయా గ్రామాల్లో ఆలయాల వద్ద దీక్షలు విరమించారు. ఆలయాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
చేవెళ్లటౌన్ : మహాశివరాత్రి సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలోని కొనగట్టు భ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవాలయంలో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థ చేవెళ్ల కన్వీనర్ రామగౌడ్, భాస్కర్, నర్సింహులు, బుచ్చిరాములు, మనోహర్ రెడ్డి ఆంజనేయులు పాల్గొన్నారు.