కడ్తాల్, మార్చి 1: నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన రాములమ్మకు రూ.1,25,000 ల సీఎం సహాయనిధి చెక్కును మంగళవారం గ్రామంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని తెలిపారు.
ఈజీఎస్ పథకంలో కడ్తాల్ మండలానికి రూ.1.25 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. ఏక్వాయిపల్లి గ్రామానికి రూ.20 లక్షలు, కడ్తాల్, అన్మాస్పల్లి, బాలాజీనగర్, చల్లంపల్లి, చరికొండ, గడ్డమీదితండా, గోవిందాయిపల్లి, గోవిందాయిపల్లి తండా, కర్కల్పహాడ్, మైసిగండి, మక్తమాదారం, మర్రిపల్లి, ముద్విన్, నార్లకుంటతండా, న్యామతాపూర్, పెద్దవేములోనిబావితండా, పల్లెచెల్కతండా, రావిచేడ్, రేఖ్యాతండా, సాలార్పూర్, వాసుదేవ్పూర్ గ్రామాలకు రూ.5 లక్షల చొప్పున సీసీ రోడ్ల నిర్మాణానికి కేటాయించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా తొలి విడుతలో మండలంలోని 16 పాఠశాలలను ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో వెల్దండ జడ్పీటీసీ విజితారెడ్డి, సర్పంచ్ యాదయ్య, ఉప సర్పంచ్ వినోద్, ముత్యాలు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటయ్యయాదవ్, జంగయ్యగౌడ్, గోపాల్, పర్వతాలు పాల్గొన్నారు.
మండల పరిధిలోగల మైసిగండి గ్రామంలో కొలువైన కాశీవిశ్వనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం ఆలయ ఆవరణలో హోమాలు, స్వా మి వారికి అభిషేకాలు నిర్వహించారు. ఏక్వాయిపల్లి గ్రామంలోని మల్లన్నగుట్టపై నిర్వహిస్తున్న ఉత్సవాల్లో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పాల్గొని అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో ఆలయ ఈవో స్నేహలత, ఆలయ ట్రస్టీ శిరోలీ, తహసీల్దార్ ఆర్పీ జ్యోతి, సర్పంచ్ తులసీరాంనాయక్, ఆలయ నిర్వాహకులు భాస్కర్నాయక్, అరుణ్కుమార్, వ్యాపారవేత్త ప్రకాశ్జైన్, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
తలకొండపల్లి : మండల పరిధిలోని చుక్కాపూర్ గ్రామంలోని మల్లప్పగుట్టపై వెలిసిన మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం మూడో రోజుకు చేరాయి. ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, భక్తులు పూజలు చేశారు. కల్యాణోత్సవానికి వివిధ గ్రామాల భక్తులు విచ్చేసి సామూహిక వ్రతాలు చేశారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ చెర్మన్ శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీలు ఉప్పల వెంకటేశ్, విజితారెడ్డి, ఎంపీపీ నిర్మల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.