షాబాద్, మార్చి 1: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత నేత పట్నం రాజేందర్రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. మంగళవారం రాజేందర్రెడ్డి 34వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పీఆర్ఆర్ స్టేడియంలో రాజేందర్రెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పట్నం నరేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి, జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డితో కలిసి ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. రాజేందర్రెడ్డి పేరుపై పీఆర్ఆర్ విద్యాసంస్థలు నెలకొల్పి పేద విద్యార్థులకు 50 శాతం రాయితీతో విద్యను అందిస్తున్నామని తెలిపారు. క్రికెట్ మొదటి బహుమతి రూ. 75 వేలు, రెండో బహుమతి రూ. 50 వేలు, వాలీబాల్ మొదటి బహుమతి రూ.25 వేలు, రెండో బహుమతి రూ. 15 వేలతో పాటు జ్ఞాపికలను అందజేశారు. అనంతరం రూ. 10 లక్షలతో స్టేడియం అభివృద్ధి పనులు ప్రారంభించారు. జడ్పీటీసీ అవినాశ్రెడ్డి సహకారంతో గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా 8 మంది దివ్యాంగులకు ఉచితంగా ట్రై స్కూటీలు పంపిణీ చేశారు. రాజేందర్రెడ్డికి క్రీడలంటే ఇష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల, కొడంగల్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పట్నం నరేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి, స్థానిక జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, వైస్ ఎంపీపీ జడల లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్న, పీఏసీఎస్ చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ మద్దూరి మల్లేశ్, సర్పంచ్ సుబ్రమణ్యేశ్వరి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, కార్యదర్శి శ్రీరాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ కోట్ల మహేందర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : పట్నం రాజేందర్రెడ్డి వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు మాణిక్యరెడ్డి, నర్సింలు, యాదగిరి పాల్గొన్నారు.