ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 30: రైతుబంధు పథకం ద్వారా రంగారెడ్డి జిల్లాలోని రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నది. శుక్రవారం మూడోరోజూ జిల్లాలోని మూడు ఎకరాల్లోపు భూమి ఉన్న 2,31,517మంది రైతులకు రూ.141. 03 కోట్ల డబ్బును ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మొదటిరోజు 1,16,240 మంది రైతులకు రూ.32.40కోట్లు, రెండోరోజు 1,89,637మందికి రూ.88.50 కోట్ల రైతుబంధు సాయం అందింది. పెట్టుబడి సాయం అందుతుండటతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
వికారాబాద్ జిల్లాలో 42,737 మంది రైతులకు..
బొంరాస్పేట, డిసెంబర్ 30: వికారాబాద్ జిల్లాలో రైతుబంధు సాయం పంపిణీ కొన సాగుతున్నది. శుక్రవారం మూడోరోజూ జిల్లాలోని మూడు ఎకరాల్లోపు భూమి ఉన్న 42,737 మంది రైతుల ఖాతాల్లో రూ.54 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. మొత్తంగా మూడు రోజుల్లో కలిపి 1.78 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.127 కోట్ల పెట్టుబడి సాయం జమ అయ్యింది. ఫోన్లకు వస్తున్న సమాచారాన్ని చూసుకుని రైతులు మురిసిపోతున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తమ కష్టాలు తీరాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతన్నకు అండగా నిలిచి.. పెట్టుబడి సాయా న్ని అందించి ఆదుకుంటున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో అన్నదాతలు వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. -మొద్దు అంజిరెడ్డి, రాష్ట్ర ఉత్తమరైతు